భారతీయ సంస్కృతికి చిహ్నంగా.. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా వెలుగొందుతోంది కాంబోడియాలోని "అంగ్కోర్ వాట్ దేవాలయం". ప్రపంచ చారిత్రక కట్టడాలలో ఒకటిగా పేరు సంపాదించిన ఈ ఆలయం.
ఎవ్వరు కూడా తన తప్పుని తాను తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు. ప్రతీవాడికి కోపమే, ప్రతీవాడికి కోర్కెలే. అపారమయిన కోర్కెల చేత, కోపము చేత తమ ఆయుర్దాయాన్ని వారు తగ్గించేసుకుంటారు. అపారమయిన కోర్కెల చేత, కోపము చేత తిరగడ౦ వల్ల వ్యాధులు వస్తాయి.
ఇది యుగం కలియుగం. కలిపురుషుడి ఉత్పత్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది! "క్రుద్దుడు" అనబడే వాడు "హింస" అనబడే తన తోడబుట్టిన చెల్లెల్నే వివాహమాడాడు. వారికి కలిగిన కుమారుడే "కలిపురుషుడు". అంటే ఎంత వేద విరుద్దంగా అతడు జన్మించాడో అర్ధమవుతుంది.
"ధర్మమా"! అంటే ఏమిటి? అనేవాడే కలిపురుషుడు. అటువంటి వాడు కలియుగ పాలకుడు అయితే ఇంకెంత అధర్మంగా పలిస్తాడో ఆలోచించండి.
కార్తవీర్యార్జునుడు వేయిచేతులతో ఉంటాడు. ఎందుకో ఒకరోజు వేటాడడానికి అరణ్య్నానికి వచ్చాడు. "విధి" అని ఒకటి ఉంటుంది కదూ... అప్పుడే ఆయనకి ఆకలి, దాహం వేసింది. ఇక్కడ ఎవరున్నారు అని వేతుక్కుంటూ వెళ్ళాడు. అరణ్యంలో "జమదగ్ని" మహర్షి ఆశ్రమం కనపడింది. అప్పటికి పరశురాముడు ధర్భలకి, కట్టెలకోసం అడవికి వెళ్ళాడు. ఒక్క జమదగ్ని, రేణుకా దేవి, నలుగురు కొడుకులే ఉన్నారు.
వ్యాస పూర్ణిమను - గురుపూర్ణిమ.
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే
నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః
ప్రతి సంవత్సరం ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మ తిథి అయిన గురు పూర్ణిమ గా మనం జరుపుకుంటాం. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.