మనం సంకల్పం అని ఒకటి చేస్తూఉంటాం. ప్రతీ రోజూ పూజ చేసేటప్పుడు "దేశకాలసంకీర్తనమూ" అంటారు.
అందులో "భరత వర్షే, భరత ఖండే" అని చెప్తూంటం. దేశమూ, కాలమూ ఈ రండూ ప్రధానంగా దేనికొరకు అంటే ధర్మానుష్ఠానం కొరకు.
"భారతీయ ఆచారంలో" గృహస్దుయొక్క పధాన కర్తవ్యాలలో అతిధి మర్యాద ముఖ్యమైనది. అందులో తెలియజేయబడ్డ ఎన్నో ధర్మసూక్ష్మాలలో తెలుసుకుంటే మన సంస్కృతి యొక్క ఔన్నత్వం అర్ధమవుతుంది!
వర్షాకాలం కాస్త ఊపందుకుని, నేల తడిచి, చెరువులు నిండే కాలాన్ని మన పెద్దలు పొలం పనులకు అనువైన సమయంగా భావించారు. అందుకని ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని `తొలి ఏకాదశి`గా పేర్కొన్నారు. ఆ రోజున పాలేళ్లని పిలిచి, పొలం పనులని మొదలుపెట్టించేవారు.
పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును మనం భోగి పండుగగా జరుపుకుంటాం. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది.
సంక్రాంతి వేడుకల్లో చివరి రోజు పండుగ కనుమ. దీనిని ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి కారణభూతం అయిన ఈ గోవర్ధనగిరికి మరియు గోవులకి ఈ కనుమ రోజు పూజ చేయడం జరిగింది.
"వైకుంఠ౦"లో ప్రశాంతంగా సేదతీరే అవకాశం ఉండి కూడా యుగయుగములందు అవతార స్వీకరణములు చేస్తూ, తను కష్టపడుతూ చెడు నుంచి, రాక్షసుల నుంచి మనుష్యులను కాపాడుచున్న ఆ పరమాత్మున్ని "కలియుగములో" మనమే త్రికరణశుద్ధితో కూడిన భక్తి శ్రద్ధలతో ఆయనను కాపాడాలి.