కవులు మహాపురుషులు, తెలుగు

భావనఋషి మరియు పద్మశాలి వంశ స్థాపన

భావనఋషి మరియు పద్మశాలి వంశ స్థాపన
Views: 19

భావనఋషి గారు పద్మశాలి వంశము యొక్క మూలపురుషుడు. సాక్షాత్తుగా శ్రీమన్నారాయణ అంశగా భక్తుల భావిస్తారు. ఆయన వైశాఖ శుద్ధ పంచమి మృగశిర నక్షత్రంలో జన్మించారు. ఇతను శ్రీ మార్కండేయుని పుత్రుడు. భావన ఋషిగారిని భృగు వంశంలో జన్మించిన “భార్గవ” శ్రేష్ఠులు. అతనికి వేద శిర్షుడు అనగా వేదములకు శిరస్సు వంటివాడని, బహూత్తమ, వస్త్ర బ్రహ్మ అనే బిరుదులు ఉన్నాయి. యావత్ లోకములకు వస్త్రదానం చేసి మానవ జాతి యొక్క మాన ప్రాణాలను కాపాడిన ఋషి శ్రేష్ఠుడు.

భావనఋషి

పద్మసంహిత గ్రంథంలో భావనఋషి మూల చరిత్ర

పూర్వం.. కాలువాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని ద్వారా వరం పొంది సకల దేవతలను మానవులను హింసించేవాడు. ప్రజలు వాడి నుండి విముక్తి పొందాలని శ్రీమహా విష్ణువుని ప్రార్థించగా తన వంశస్తుడు ఋషి శ్రేష్టుడు భార్గవుడు అయిన మార్కండేయుడిని యజ్ఞము చెయ్యాల్సిందిగా కోరారు. బ్రహ్మచారి అయిన మార్కండేయునికి అగ్ని తన పుత్రిక అయిన దూమ్రావతిని ఇచ్చి వివాహం చెయ్యగా, వారు సకల దేవతల సమక్షమంలో “మహా వారుణిక” అనే యజ్ఞాన్ని చెయ్యగా, ఫలంగా హోమం నుంచి ఆజానుబాహుడు, తేజోమూర్తి అయోని సంభవుడయిన శ్రీ మహా విష్ణువు అంశగా “వేద శీర్షుడు” భావనారాయణుడు ఉద్భవించారు. అతనికి సూర్య పుత్రిక “భద్రావతీ దేవి”ని ఇచ్చి వివాహం చేసారు. మానవాళికి నగ్నత్వం నుంచి విముక్తి కలిగించాలని మహావిష్ణువు నాభి నుంచి వికసించిన పద్మము (కమలము) నుంచి తంతువులు గ్రహించి ఓతము అనగా ఋగ్వేదం, పడుగు, ప్రోతము నాగ అధర్వణ వేదం, ప్యాక అనే వేదసారము ద్వారా యంత్రములు సృష్టించి ధర్మ పత్ని సమేతుడై “మణిపురము”న ఒక గృహాన్ని నిర్మించి చైత్ర శద్ధ పంచమి రోజున మొట్టమొదటి “లక్ష్మీ విలాసం” అనే ఉత్కల పౌష్టిక వస్త్రములు సృష్టించారు.వాటిని..

లక్ష్మీనారాయణులకు సమర్పించగా ఆనందభరితములైన వారు పద్మ బ్రహ్మ, బహోత్తమా అనే బిరుదులు అంకితం చేసారు.

బ్రహ్మ సరస్వతులకు సమర్పించగా వారు సంతోషించి 64 కళల సారస్వతాన్ని అఖండ బ్రహ్మ జ్ఞానమును ప్రసాదించారు.

శివ పార్వతులకు సమర్పించగా “గౌరిదేవి మృత సంజీవని విద్య” మరియు “శాంభవీ విద్యలను” అనుగ్రహించారు. శివుడు పులిచర్మాన్ని కోరుకోగా పెద్దపులిని చూసి నఖఃశిక పర్యంతం శుభ్రంచేసి సమర్పించడం జరిగింది. సకల దేవతలందరూ సంతోషభరితులై 36 బిరుదులు బహూకరించారు. శ్రీమహావిష్ణువు వేద శీర్షుణకు నూరు పద్మములు ఇచ్చారు. వాటి ప్రసాదమున వంద మంది మహర్షుల సంతానం కలిగింది.

పద్మశాలి వంశ స్థాపన

శ్రీ భావనఋషి పుత్రులు వంద మంది శత మార్కండేయులుగా కొనియాడబడ్డారు. వారి పుత్రులు: మహా పద్ములు, పద్మశాఖీయులు, పద్మశాలీయులు, పద్మ కువిందులు అనే బిరుదులతో కీర్తింబడగా వారే నేడు పద్మశాలీలుగా పిలవబడుతున్నారు.

What’s your response?
1 responses
Love
Love
0
Smile
Smile
1
Haha
Haha
0
Sad
Sad
0
Star
Star
0
Weary
Weary
0

Leave a Reply